తవ్వకాల్లో 505 గోల్డ్ కాయిన్స్ లభ్యం

తవ్వకాల్లో 505 గోల్డ్ కాయిన్స్ లభ్యం

తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలోని జంబుకేశ్వర్‌ ఆలయంలో పురాతన కాలం నాటి బంగారు కాయిన్స్ లభ్యమయ్యాయి. అఖిలాండేశ్వరి సన్నిధి చుట్టూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు నిన్న(బుధవారం) తవ్వకాలు జరిపించారు ఆలయాధికారులు. కూలీలు తవ్వకాలు జరుపుతుండగా.. వారికి ఇనుముతో చేసిన కుండ కనిపించింది. ఆ కుండను వెలికి తీసి చూడగా.. అందులో 505 బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆలయ అధికారులు ఈ విషయాన్ని శ్రీరంగం తహసిల్డార్‌ ఆర్‌. శ్రీధర్‌కు తెలిపారు. తహసిల్దార్‌ కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ గోల్డ్ కాయిన్స్ బరువు 1.716 కేజీలు ఉన్నట్లు తెలిపారు. బంగారు నాణేలను ఆర్కియాలజీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.