
కామారెడ్డి, వెలుగు: అల్ప్రాజోలం అక్రమ రవాణా కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురిని నార్కొటిక్స్పెషల్టీమ్అదుపులోకి తీసుకుంది. ఇందులో ఓ ఎక్సైజ్కానిస్టుబుల్ ఉన్నారు. ఇటీవల హైదరాబాద్సమీపంలోని షాద్ నగర్లో పెద్ద మొత్తంలో అల్ప్రాజోలం పట్టుబడింది. నార్కొటిక్స్పెషల్టీమ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన వారి పేర్లు బయటకు వచ్చాయి.
రెండు రోజుల కింద కామారెడ్డి ఎక్సైజ్స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్, నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్పల్లికి చెందిన కల్లు వ్యాపారులను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్కానిస్టేబుల్రమేశ్ను సోమవారం షాద్నగర్లో అరెస్ట్చేసినట్లు తెలిసింది. ఎక్సైజ్కానిస్టేబుల్ నాలుగు రోజులుగా డ్యూటీకి రావడం లేదని తెలుస్తోంది.