టికెట్లు అమ్ముకున్న రేవంత్​​పై చర్యలు తీసుకోండి

టికెట్లు అమ్ముకున్న రేవంత్​​పై చర్యలు తీసుకోండి
  • కాంగ్రెస్ బహిష్కృత నేత కురువ విజయ్ కుమార్ డిమాండ్
  • ఈడీ ఆఫీసు ముందు ఆందోళన

బషీర్​బాగ్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ టికెట్ల అమ్మకాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై దర్యాప్తు జరపాలని పార్టీ బహిష్కృత నేత డాక్టర్ కురువ విజయకుమార్ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మంగళవారం బషీర్​బాగ్​లోని ఈడీ ఆఫీసు ముందు తన అనుచరులతో బైఠాయించి ఆందోళన చేయగా.. పోలీసులు విజయ్​కుమార్​ను అరెస్టు చేశారు. అనంతరం విజయ్​కుమార్​ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమాలపై 12 రోజుల కిందట 28పేజీల ఆధారాలు సమర్పించామని, అయినా చర్యలు తీసుకోలేదన్నారు. మనీ ల్యాండరింగ్, ఫెమా, హవాలా కోణంలో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. టికెట్ల పేరిట ఒక్కొక్కరినుంచి50వేల  డీడీలు తీసుకున్నారని, దీనిపై అన్ని పీఎస్​లలో ఫిర్యాదు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి శిక్షించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.