కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: గోవధ నిషేధ చట్టం–2011 అమలు కావడంలేదని దాఖలైన పిల్పై హైకోర్టు స్పందించింది. గతంలో మేమిచ్చిన హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, చట్టాన్ని అమలు చేయడం లేదని దాఖలైన పిల్ కు సంబంధించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన కేంద్ర పశు సంవరక్ధ శాఖ కార్యదర్శి, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం, పశుసంవరక్ధ, ఆర్ అండ్ బీ శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఇతరులకు నోటీసులు జారీ చేసింది.