- ఈ నెల 31 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల రాయితీ చెల్లింపు గడు వును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 31 వరకు గడువు పెంచుతున్న ట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉండటంతో గతేడాది డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు వాటిని క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఆ గడువు బుధవారంతో ముగిసింది. అయితే, ఇంకా చాలా చలాన్స్ పెండింగ్లో ఉం డటంతో గడువును పెంచుతూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 3.59 కోట్ల చలాన్లు పెండింగ్లో ఉండ గా, బుధవారంతో 1.30 కోట్లకుపైగా చలాన్స్ క్లియర్ అయ్యాయి.