
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ప్రజలను మంత్రాలు, తాయిత్తుల పేరుతో మోసం చేస్తున్న నకిలీ బాబాను అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని కోకస్ మన్నూర్కు చెందిన షేక్అహ్మద్ అనే వ్యక్తి బాబా అవతారమెత్తి వ్యాధులు నయం చేస్తానంటూ ప్రజలకు తాయెత్తులు కడుతూ డబ్బులు వసూలు చేస్తూ బురిడీ కొట్టిస్తున్నాడు. విషయం తెలుసుకొని అతడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఆరోగ్య సమస్యలుంటే ప్రజలు ఆస్పత్రులకు వెళ్లాలని, ఇలాంటి నకిలీ బాబాలను నమ్మి మోసపోవద్దని సూచించారు.