
తాను ఎక్కాల్సిన ఫ్లైట్లో బాంబు ఉందని ఫోన్చేశాడో ప్రబుద్ధుడు.. ఆ ఫోన్కాల్తో ఎయిర్పోర్ట్ లో గందరగోళం నెలకొని ప్రయాణికులు టెన్షన్ పడుతుంటే, ఎయిర్పోర్ట్క్యాంటీన్లో తీరిగ్గా కూర్చుని చోద్యం చూశాడు. శనివారం శంషాబాద్ఎయిర్పోర్ట్లో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు.. ఇండిగో ఫ్లైట్లో బాంబు ఉందని ఓ ఆగంతకుడు ఫోన్లో బెదిరించాడు. దీంతో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. చైన్నై వెళ్లాల్సిన ఫ్లైట్ను ఆపి బాంబ్స్క్వాడ్తో క్షుణ్ణంగా చెక్చేశారు. మిగతా విమానాలను, ఎయిర్పోర్ట్లాంజ్లోనూ చెకింగ్జరిపారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది డాగ్స్క్వాడ్తో పరిశీలించింది. ఈ తతంగంచూసి ప్రయాణికులు ఆందోళనచెందారు. పూర్తిగా చెక్చేసినా బాంబు దొరకకపోవడంతో ఫోన్కాల్ఫేక్అని తేల్చారు. దీనిపై పోలీసులు ఎంక్వైరీ చేసి, ఎయిర్పోర్ట్క్యాంటీన్లో కూర్చున్న విశ్వనాథం అనే యువకుడిని అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన విశ్వనాథ్ ఆఫీసు పనిమీద సికింద్రాబాద్కు వచ్చాడు. తిరిగి చెన్నై వెళ్లేందుకు శంషాబాద్ఎయిర్పోర్టుకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న విశ్వనాథ్ఫ్లైట్ఎక్కడానికి బదులు ఫోన్చేసి విమానంలో బాంబు ఉందని బెదిరించాడని పోలీసులు చెప్పారు. విశ్వనాథ్పై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు.