బీ అలర్ట్ : రూ.500 దొంగనోట్లు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి

బీ అలర్ట్ : రూ.500 దొంగనోట్లు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి

మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి దాదాపు రూ. 50 లక్షల విలువ కలిగిన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.  విచారణలో వారి వద్ద నుంచి ఎలాంటి సీరియల్ నంబర్ లేని రూ.500 విలువ కలిగిన 9 వేల 981 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

స్వాధీనం చేసుకున్న నోట్లు అసలు నోట్లు లాగానే ఉన్నాయని, ఈ నోట్లను మార్కెట్‌లో చెలామణి చేయాలని నిందితులు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉస్మాన్ దుషాప్ సాహా (40), అబ్దుల్ హసన్ టర్క్ (41) అనే ద్వయం నుంచి రూ. 1,09,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. నిందితులపై 420 (మోసం), 489 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.