కరాచీ పేరుతో నకిలీ మెహందీ..గుట్టు రట్టు చేసిన పోలీసులు

కరాచీ పేరుతో నకిలీ మెహందీ..గుట్టు రట్టు చేసిన పోలీసులు
  • రూ.8 లక్షల విలువైన మెషీన్లు, మెహందీ స్వాధీనం

బషీర్‌‌బాగ్‌‌, వెలుగు: బాలాపూర్‌‌లో నకిలీ కరాచీ మెహందీ కోన్‌‌ల తయారీ, సరఫరా చేస్తున్న కేంద్రంపై టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ.8 లక్షల విలువైన యంత్రాలు, నకిలీ మెహందీని స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్‌‌లోని మినార్​ కాలనీలో అక్రమంగా యూనిట్‌‌ ఏర్పాటు చేసి కరాచీ మెహందీ పేరుతో నకిలీ కోన్‌‌లు తయారు చేసి, హైదరాబాద్‌‌తో పాటు ఇతర నగరాలకు సరఫరా చేస్తున్నారు.

 విషయం తెలుసుకున్న సౌత్‌‌-ఈస్ట్‌‌ జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు బాలాపూర్, అఫ్జల్‌‌గంజ్‌‌ పోలీసులతో కలిసి మినార్‌‌ కాలనీలోని తయారీ కేంద్రంతో పాటు అఫ్జల్‌‌గంజ్‌‌లోని ఎస్‌‌కేఎస్‌‌ ట్రావెల్స్‌‌ అండ్​ కార్గోపై దాడులు చేశాడు. నకిలీ మెహందీ తయారు చేసి సరఫరా చేస్తున్న మహ్మద్‌‌ ఆసిఫ్‌‌ (48), దీపక్‌‌కుమార్‌‌ (25)ను అదుపులోకి తీసుకున్నారు. 8,400 నకిలీ మెహందీ కోన్‌‌లు, మెషీన్లు, కెమికల్స్​, ప్యాకింగ్‌‌ సామగ్రి, రెండు మొబైల్‌‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏడీసీపీ అందే శ్రీనివాస రావు తెలిపారు.