- మంత్రి సమక్షంలో కాంగ్రెస్లోకి చేరికలు
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీ 11వార్డు శివాజీ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు. సామాజిక కార్యకర్త బూర్కుల విక్రమ్గౌడ్–-సోనీప్రియ దంపతులు, బీఆర్ఎస్ కు చెందిన అశోక్, జంజిరాల కృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్లో చేరగా వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ప్రజా ప్రభుత్వం, మంత్రి వివేక్వెంకటస్వామి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్లో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్రెడ్డి, లీడర్లు గోపతి రాజయ్య, పల్లె రాజు, అబ్దుల్అజీజ్, ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, జంగం కల, నీలం శ్రీనివాస్గౌడ్, శ్యాంగౌడ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు
మందమర్రిలోని సీఎస్ఐ చర్చిలో బుధవారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలబ్రేషన్స్లో మంత్రి వివేక్, కలెక్టర్ కుమార్ దీపక్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లుతుంగపిండి రాజలింగు, గద్దె రాజు, చర్చి ఫాస్టర్లు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసిన మంత్రి సంబురాలు ప్రారంభించారు. క్రైస్తవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
నెరవేరిన కల
క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వెలుగుల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మున్సిపల్ వాసుల కల నెరవేరింది. రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన లైటింగ్సిస్టంను బుధవారం రాత్రి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. దీంతో మున్సిపాలిటీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
