భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్లు.. 294 సీసాలు స్వాధీనం

భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్లు.. 294 సీసాలు స్వాధీనం

హైదరాబాద్ శేరిలింగంపల్లిలో భారీగా నకిలీ మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఖరీదైన స్కాచ్ బాట్టిల్ లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలిపి సొమ్ము చేసుకుంటున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. 

ALSO READ: లులూ మాల్ లూటీ చేశారు.. తినేశారు.. తాగేశారు.. ఊడ్చేశారు..
 

నిందితుల దగ్గర మొత్తం 24 ఫుల్ బాటిళ్లు, పలు విదేశీ కంపినీలకు చేందిన 294 ఖాళీ బాటిళ్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్ లు, ప్రైవేట్ ఈవేంట్ లలో పని చేస్తున్న బార్ సిబ్బంది నుంచి ఈ ఖరీదైన ఖాళీ స్కాచ్ మద్యం బాటిళ్లులను నిందితులు సేకరించి.. ఆ సీసాల్లో తక్కువ ధర కలిగిన మద్యాన్ని పోసి అమ్ముతామని వారు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులు ఎండీ అజాం, సుశాంత్, సత్య సుందర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.