చౌటుప్పల్లో వైన్ షాపులపై దాడులు..భారీగా నకిలీ మద్యం సీజ్

చౌటుప్పల్లో  వైన్ షాపులపై దాడులు..భారీగా నకిలీ మద్యం సీజ్

హైదరాబాద్ శివారులో భారీగా నకిలీ మద్యం దొరికింది. హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ లోని వైన్ షాపులపై ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు జరిపారు. భారీగా  నకిలీ మద్యాన్ని గుర్తించారు. చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారంలో కోటి రూపాయలపైగా విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సీజ్ చేసిన నకిలీ మద్యం... లిక్కర్ వ్యాపారులు బింగి బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డిలకు చెందిన డంప్ గా గుర్తించారు. వీరిద్దరిని ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నన్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండలో జిల్లాల్లో బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డికి 20కి పైగా వైన్ షాప్ లు ఉన్నాయి. వీరిద్దరికి చెందిన వైన్ షాపుల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మునుగోడు ఎలెక్షన్ లో ఇదే మద్యాన్ని సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ మద్యాన్ని తెచ్చి చౌటుప్పల్ లో భారీగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.