- వెస్టిండీస్ అధికారులు తాము ఇవ్వలేదన్నారు
- స్పష్టం చేసిన నల్గొండ హెల్త్ ఆఫీసర్
నల్గొండ, వెలుగు : నల్గొండలోని అపర్ణ స్కానింగ్ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్తో స్కానింగ్ సెంటర్ నడిపిస్తున్నారని ఏప్రిల్ 21న హెల్త్ ఆఫీసర్లు స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వారు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని రీ ఓపెన్ చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా, ఫేక్ సర్టిఫికెట్కు సంబంధించి ఆధారాలు కనిపెట్టేందుకు మెడికల్ ఆఫీసర్లు తీవ్రంగా శ్రమించారు. వారు చేసిన విచారణలో వెస్టిండీస్నుంచి ఎండీ రేడియోడయాగ్నిస్ట్ కోర్సు చదివినట్లు సర్టిఫికెట్ తెచ్చుకున్నారని తేలింది. విచారణలో భాగంగా ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కౌన్సిల్ను కూడా సంప్రదించారు. భారత రాయభార కార్యాలయం ద్వారా వెస్టిండీస్లోని అధికారులతో మాట్లాడగా వారు తమ దేశానికి చెందినది కాదని చెప్పారని తెలిసింది.
త్వరలో అడ్వయిజరీ కమిటీ భేటీ
ఫేక్సర్టిఫికెట్ అని తేలడంతో జిల్లా అడ్వయిజరీ కమిటీ త్వరలో భేటీ కానుందని సమాచారం. జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీ, ఎన్జీఓ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ముందు వెస్టిండీస్ నుంచి సేకరించిన ఆధారాలు సమర్పించి, స్కానింగ్సెంటర్పై చర్యలు తీసుకుంటామని హెల్త్ ఆఫీసర్ రవిశంకర్ తెలిపారు. కాగా, స్కానింగ్ సెంటర్పై క్రిమినల్ కేసులు నమోదు చేశామని టౌ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే చార్జీషీట్ ఫైల్ చేయబోతున్నట్టు చెప్పారు.