పెండ్లికూతురు ముస్తాబుకి ఫేమస్​ పట్టీలు

పెండ్లికూతురు ముస్తాబుకి ఫేమస్​ పట్టీలు

పెండ్లికూతురు ముస్తాబుకి పట్టీలు కొత్త కళ తెస్తాయి. ముఖ్యంగా మీనాకారి పట్టీలు పెట్టుకుంటే మహాలక్ష్మి  నడిచొచ్చినట్టే ఉంటది. అందుకే వీటికి పెండ్లికూతురు పట్టీలని పేరుంది. కొందరు బారాత్​ పట్టీలని కూడా అంటుంటారు. ఈ రాజస్తానీ ఫేమస్​ పట్టీల స్పెషాలిటీ ఏంటంటే.. ఎనామిల్​ ఆర్ట్​​. రకరకాల జంతువులు, పక్షుల బొమ్మలు, రంగురంగుల పూసలు, కుందన్స్​తో  తయారుచేసే ఈ పట్టీలు పెండ్లి కూతురికి పర్ఫెక్ట్​ ఛాయిస్​. అందుకే వాటిల్లో కొన్ని మోడల్స్​ మీకోసం. ఇవి ఐదొందల రూపాయల పైనుంచి దొరుకుతున్నాయి.