వంశీ కృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని రక్తంతో లేఖ

వంశీ కృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని రక్తంతో లేఖ

అమ్రాబాద్, వెలుగు:  అచ్చంపేట ఎమ్మెల్యే డా.   చిక్కుడు వంశీకృష్ణకు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించాలని అభిమానులు రక్తంతో లేఖ రాశారు. పదర మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు సీఎం రేవంత్ రెడ్డికి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తమ రక్తంతో రాసిన లేఖలో  కోరారు.

లేఖ రాసిన వారిలో ఆనంద్, రామలింగయ్య, శివ, శ్రీను, బాల్ లింగయ్య, రెనయ్య, అంజి ఉనారు.