ఒమిక్రాన్ భయం.. ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు

ఒమిక్రాన్ భయం.. ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ: ఒమిక్రాన్​ వైరస్​ వ్యాప్తి భయంతో చాలా దేశాలు ట్రావెల్​ ఆంక్షలు పెడుతున్నయ్. ఇంటర్నేష నల్​ ఫ్లైట్లను తమ దేశంలోకి రానివ్వట్లేదు. మిగిలిన దేశాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఫ్లైట్​ టికెట్​ రేట్లను ఎయిర్​లైన్స్ సంస్థలు అడ్డగోలుగా పెంచడమే దీనికి కారణం. కొన్ని రూట్లలో అయితే టికెట్​ రేట్​ ఏకంగా వంద శాతం పెంచేశాయి. అదేమంటే ప్రయాణికులను సేఫ్​గా తీసుకెళ్లడానికి, విదేశాలు పెట్టిన కండీషన్లకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి ఖర్చవుతోందని ఆయా కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు. గతంలో రూ.80 వేలకు కాస్త అటూఇటూగా ఉన్న ఢిల్లీ- టొరంటో ఫ్లైట్​ టికెట్​ ధర ఇప్పుడు రూ.2.37 లక్షలకు చేరింది. ఢిల్లీ నుంచి లండన్​కు టికెట్ ​ధర గతంలో రూ.60 వేలు ఉండగా.. ఇప్పుడది రూ.1.2 లక్షలకు పెరిగింది.