రాజన్న సిరిసిల్ల, వెలుగు: పొలం వద్ద కాలువ నీటికి సంబంధించిన గొడవతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం రత్నంపేటకు చెందిన గురిజాల చంద్రశేఖర్ (53) కు అదే గ్రామానికి చెందిన ఏడిగె మల్లేశానికి పొలం వద్ద కాలువ నీటి విషయమై గొడవ జరిగింది. దీంతో మల్లేశం...చంద్రశేఖర్ పై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. బోయిన్పల్లి ఎస్ఐ మహేందర్జులై మొదటివారంలో ఇద్దరిని పిలిపించి మాట్లాడి పంపించారు. అయితే, ఈ నెల ఆగస్టు1న చంద్రశేఖర్ సిరిసిల్లకు వచ్చి కోర్టు ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో పురుగుల మందు తాగాడు. దీంతో పోలీసులు చంద్రశేఖర్ పై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ గురువారం కన్నుమూశాడు. అయితే, ఆగస్టు1న చంద్రశేఖర్ తన చావుకు కారణం బోయిన్పల్లి ఎస్ఐ, ఏఎస్ఐ బాబు, ఏడిగె మల్లేశం, గురిజా శ్రీధర్ కారణం అని ఓ పేపర్పై రాశాడు. ఇవి సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. తను చనిపోతున్నాను కాబట్టి తన కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రాశాడు. గురువారం చంద్రశేఖర్మరణించడంతో ఆయన బంధువులు చంద్రశేఖర్ మరణానికి కారణం ఏడిగె మల్లేశం అని అంటూ సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
కాలువ నీటి విషయంలో గొడవ.. పురుగుల మందు తాగిన రైతు
- కరీంనగర్
- August 18, 2023
లేటెస్ట్
- MI vs SRH: కమ్మేసిన సూరీడు.. హైదరాబాద్కు తప్పని ఓటమి
- ఆల్ ది బెస్ట్ మేడమ్: రేపు అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్..ముచ్చటగా మూడోసారి
- T20 World Cup 2024: భారత వరల్డ్ కప్ జెర్సీకి కాషాయ రంగు.. నెట్టింట ట్రోలింగ్
- Malayalam Director Harikumar: ప్రముఖ దర్శకుడు,కథా రచయిత కన్నుమూత
- పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ లో రూ. 6 కోట్ల స్కాం
- Rajamouli Media Interaction: రేపు మీడియా ముందుకు రానున్న రాజమౌళి..మహేశ్తో సినిమాపై అప్డేట్!
- ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారా... ప్రాణాంతక వ్యాధులకు స్వాగతం చెప్పినట్టే..
- MI vs SRH: కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గట్టెక్కిన సన్రైజర్స్
- 10 ఏండ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో చెప్పాలి : శ్రీధర్ బాబు
- కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాలను పోగొట్టుకోవాల్సి వస్తది : హరీష్ రావు
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల