
రామాయంపేట, వెలుగు: ఎలుగుబంటి దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. రామాయంపేట మండలం జాన్సీలింగా పూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని సదా శివనగర్ తండాలో శనివారం రాత్రి ఘటన జరిగింది. తండాకు చెందిన హనుమంతు సాయంత్రం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. అతనిపై ఎలుగు బంటి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.దీంతో అతడిని కుటుంబ సభ్యులు ట్రీట్ మెంట్ నిమిత్తం పేట ప్రభు త్వ ఆసుపత్రికి తరలించి, అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి తరలించారు.