పడావు భూములకు రైతు భరోసా వద్దు : రైతులు

పడావు భూములకు రైతు భరోసా వద్దు : రైతులు
  • అభిప్రాయాలు వ్యక్తం చేసిన పలువురు రైతులు 

కొడంగల్​, వెలుగు: పడావు పడిన భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని పలువురు రైతులు అభిప్రాయప్డడారు. మంగళవారం కొడంగల్​ పీఎసీఎస్​ఆఫీస్​లో ప్రెసిడెంట్​శివకుమార్, ఎంపీపీ ముద్దప్ప అధ్యక్షతన అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

రైతు భరోసాపై అభిప్రాయాలు సేకరించారు.10 ఎకరాలలోపు వారికే రైతు భరోసా ఇవ్వాలని, వెంచర్లకు, గుట్టలకు ఇవ్వొద్దని రైతులు పేర్కొన్నారు. అదేవిధంగా పెట్టుబడి సాయం త్వరగా అందేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఏడీఏ శంకర్​రాథోడ్, ఏఓ లావణ్య ఉన్నారు.