భూములు ఇప్పించాలని రైతుల భిక్షాటన.. కుల్కచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన

భూములు ఇప్పించాలని  రైతుల భిక్షాటన.. కుల్కచర్ల పోలీస్ స్టేషన్  ఎదుట నిరసన

పరిగి, వెలుగు: అక్రమంగా తమ భూములను కాజేసిన రియల్​ ఎస్టేట్​ బ్రోకర్ల నుంచి తిరిగి భూములను ఇప్పించాలని రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. సోమవారం కుల్కచర్ల మండలంలోని అంతారం గ్రామానికి చెందన రైతులు కుల్కచర్ల ప్రధాన కూడలి నుంచి తహసీల్దార్​ కార్యాలయం వరకు రైతులు భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం కుల్కచర్ల పోలీస్​ స్టేషన్​  ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2024 నవంబర్​లో  రియల్​ ఎస్టేట్​ బ్రోకర్లు రైతుల భూములను మార్టిగేజ్​ చేసి డబ్బులు ఇవ్వమంటే ముఖం చాటేశారని తెలిపారు. తిరిగి తమ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్​ చేయాలని డిమాండ్​ చేశారు.