
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రైతుల ధర్నాకు దిగారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫ్ జామ్ అయ్యింది. పార్టీలకతీతంగా రైతులంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28 తేదీలోగా డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గడువు ఇచ్చారు రైతులు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.