కూరగాయలు పంచిపెట్టిన రైతులు

కూరగాయలు పంచిపెట్టిన రైతులు
  •  సెక్రటేరియెట్​ దగ్గర రైతుల సంబురాలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసిన సందర్భంగా.. సెక్రటేరియెట్ దగ్గర రైతులు సంబురాలు చేసుకున్నారు.  రైతు సమాఖ్య అధ్యక్షడు చింపుల సత్యనారాయణ రెడ్డి, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు.  ముందుగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.

 అనంతరం తమ పొలాల్లో పండిన వెయ్యి కిలోల క్యాలీఫ్లవర్,  సోరకాయలను అక్కడున్న పబ్లిక్​కు ఫ్రీగా  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయటం అభినందనలు తెలిపారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదొక ఉదాహారణ అని నేతలు చెప్పారు. 

యుపీఏ ప్రభుత్వం 2004లో మాఫీ చేసిన తరువాత ఇదే పెద్ద రుణమాఫీఅని పేర్కొన్నారు. వచ్చే నెల 15 కల్లా మిగతావాళ్లందరికి  రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సత్యనారాయణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి  స్పష్టం చేశారు.