రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం 3వ టీఎంసీ పనులను అడ్డుకున్నారు రైతులు. బోయినిపల్లి మండలం రత్నంపేట, జగ్గారావుపల్లి గ్రామాల మధ్య కాళేశ్వరం లింక్ 4 నుంచి మిడ్ మానేరుకి నీటిని తరలించేందుకు వరద కాలువ పనులు చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా.. కాలువ పనులను మొదలు పెట్టారు. దీంతో తమకు పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా ప్రారంభిస్తారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొక్లెయినర్ ముందు కూర్చుని ఆందోళనకు దిగారు.
ఇవి కూడా చదవండి
వీ6, వెలుగు కథనంపై స్పందించిన అధికారులు
ఆధునిక భారత్లో ప్రజాదరణ పొందిన నేత మోడీ