రైతు ఉద్యమాన్ని ఇప్పట్లో ఆపబోం

రైతు ఉద్యమాన్ని ఇప్పట్లో ఆపబోం

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు నెలలుగా అన్నదాతలు నిరసనలు చేస్తున్నారు. రైతులతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కి రాలేదు. ఈ విషయంపై రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. ఉద్యమాన్ని ఇప్పట్లో ఆపబోమని స్పష్టం చేశారు. మరో 8 నెలల వరకు ఉద్యమాన్ని ఆపే ఉద్దేశమే లేదని క్లారిటీ ఇచ్చారు. మే 10కి కోతలు ముగుస్తాయని, ఆ తర్వాత నుంచి ఉద్యమం ఊపందుకుంటుందన్నారు.