
కౌడిపల్లి, వెలుగు: జీలుగు విత్తనాల కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడి కొనుగోలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 198 బస్తాల జీలుగు విత్తనాలు వచ్చాయి. 15 రోజులుగా విత్తనాల కోసం ఎదురుచూసిన రైతులు ఒక్కసారిగా జీలుగా విత్తనాలు వచ్చిన విషయం తెలుసుకొని బారులు తీరారు.
కౌడిపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారులు ఆన్లైన్ లో పట్టా పాస్ బుక్ చెక్ చేస్తూ ప్రతి రైతుకు పొలాన్ని బట్టి బస్తాలు అందజేశారు. మండలానికి 1,500 క్వింటాళ్లు అవసరం ఉన్నప్పటికీ 60 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయని ఏఓ స్వప్న తెలిపారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా కొంతమంది రైతులకు దొరక్కపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లిపోయారు.