బోథ్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

బోథ్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఆదిలాబాద్ జిల్లా బోథ్ తహశీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. తమకు చెందిన 15 ఎకరాల భూమిని వేరే వ్యక్తులు ఆక్రమిస్తే తహశీల్దార్ వారికి దొంగపట్టాలు ఇచ్చారంటూ రైతులు ఆందోళనకు దిగారు. తహశీల్దార్ లంచం తీసుకుని దొంగ పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే చావే శరణ్యమంటూ పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్యకు యత్నించారు. దీంతో తహశీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

https://www.youtube.com/watch?v=P8dPMiXbkUc