కౌలు రైతులకూ YSR  రైతు భరోసా : జగన్

కౌలు రైతులకూ YSR  రైతు భరోసా : జగన్

అమరావతి : కౌలు రైతులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కౌలు రైతులకు YSR రైతు భరోసా పథకాన్ని వర్తింపచేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ పెట్టుబడి సాయం అందనుందని చెప్పారు జగన్. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ శనివారం అగ్రికల్చర్‌ మిషన్‌ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలు రైతులకు రైతుభరోసా వర్తింప చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాబోయే సీజన్ కు విత్తన సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజున ప్రకటించనున్నట్లు జగన్ ప్రకటించారు. రైతు భరోసాలో ఇచ్చిన 12 హామీలను జూలై 8 నుంచి రైతు దినోత్సవం సందర్భంగా అమలు చేయనునన్నట్లు జగన్ ప్రకటించారు. అవసరం అయితే అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తామన్నారు. భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉందన్నారు.