
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉట్నూరు మండలం బీర్సాయి పేట వద్ద సోమవారం (జూన్ 16) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.