ఫతేనగర్ ఫ్లైఓవర్​ పెచ్చులూడి ఇద్దరికి గాయాలు

ఫతేనగర్ ఫ్లైఓవర్​ పెచ్చులూడి ఇద్దరికి గాయాలు

కూకట్​పల్లి, వెలుగు: ఫతేనగర్​ఫ్లైఓవర్ బ్రిడ్జి పెచ్చులూడి పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఫతేనగర్​ఎంఎంటీఎస్​ రైల్వేస్టేషన్​ సమీపంలోని ఫ్లైఓవర్​బ్రిడ్జి మెట్ల మార్గం వద్ద సోమవారం సాయంత్రం పెచ్చులూడి కిందపడ్డాయి.

 ఆ సమయంలో మెట్ల మార్గం కింద ఉన్న ఛత్తీస్​గడ్​కు చెందిన ఒక యువకుడి కాలికి తీవ్ర గాయాలు, మరొకరికి స్పల్ప గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానికులు సమీప హాస్పిటల్​కు తరలించారు.