మెదక్/పెద్ద శంకరంపేట, వెలుగు: అడవి పందుల కోసం పెట్టిన కరెంటు వైర్లు తగిలి తండ్రీకొడుకులు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో శుక్రవారం జరిగింది. పెద్దశంకరంపేట మండలం కోల్లపల్లి తండాకు చెందిన ధరావత్ హర్యానాయక్ (55) పొలం సంగారెడ్డి – నాందేడ్ నేషనల్హైవే విస్తరణలో పోయింది. వ్యవసాయం మీద మక్కువతో ఆయన తన పొలం పక్కనే ఉన్న కోల్లపల్లికి చెందిన మరొకరి పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వర్షాలు పడడంతో పొలం ఎలా ఉందో చూద్దామని గురువారం సాయంత్రం వెళ్లారు. పక్క పొలం వాళ్లు అదే సమయంలో అడవి పందుల కోసం కరెంట్ వైర్లు పెట్టారు. ఆ సంగతి తెలియని హర్యానాయక్ నేరుగా వెళుతూ ఆ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పొలానికి వెళ్లిన తండ్రి రాత్రి తొమ్మిదైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కొడుకు రాజునాయక్(26) బంధువు నవీన్ ను తీసుకుని వెతకడానికి వెళ్లాడు. పొలంలో చెరోవైపు వెతుకుతుండగా తండ్రి కింద పడిపోయి ఉండడం రాజునాయక్ గమనించాడు. కళ్లు తిరిగి పడిపోయాడేమోనని అనుకుని లేపే ప్రయత్నం చేశాడు. దాంతో అతనికి కూడా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు వచ్చిన నవీన్ వారిని చూసి వెంటనే ఊళ్లోకి వెళ్లి విషయం చెప్పాడు. గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. హర్యానాయక్ కు రాజు ఒక్కడే కొడుకు కాగా, రాజుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
అడవి పందులకు పెట్టిన కరెంట్ వైర్లు తగిలి తండ్రీకొడుకులు మృతి
- తెలంగాణం
- October 17, 2020
లేటెస్ట్
- మే 10న మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి రాక
- ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు అలర్ట్గా ఉండాలి : వీపీ గౌతమ్
- సిక్ లీవ్లో ఎయిర్ ఇండియా సిబ్బంది.. 25 మందిపై వేటు
- మార్నింగ్ వాకర్స్ తో మాలోత్ కవిత మాటామంతీ
- గర్గుల్లో అంగన్ వాడీ బిల్డింగ్ కు రిపేర్ చేయాలి
- Happy Birthday Vijay Devarakonda: కత్తి నేనే…నెత్తురు నాదే.. యుద్దం నాతోనే అంటున్న విజయ్ దేవరకొండ
- మోదీని మూడోసారి ప్రధానిని చేయాలి : కంచెట్టి గంగాధర్
- ఆర్మూర్ టౌన్లో కాంగ్రెస్ లో చేరికలు
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- అకాల వర్షం.. తడిసిన ధాన్యం
Most Read News
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- T20 World Cup 2024: ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్.. ఎందులో చూడాలంటే..?
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం