ఆది పినిశెట్టి హీరోగా ఏ.ఆర్. కె. శరవణన్ తెరకెక్కించిన తమిళ థ్రిల్లర్ ‘మరగాధ నాణ్యం’. తెలుగులో ‘మరకతమణి’గా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ స్టార్ట్ చేశారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా, హీరో కార్తి అతిథిగా హాజరై టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఫస్ట్ పార్ట్లో హీరోయిన్గా నటించిన నిక్కీ గల్రానీనే ఆది పినిశెట్టి వివాహం చేసుకోగా, పార్ట్2లో తనతోపాటు ప్రియా భవానీ శంకర్ కూడా మరో హీరోయిన్గా నటిస్తోంది.
సత్యరాజ్, డానియల్, మునీష్ కాంత్ రామ్ దాస్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పాషన్ స్టూడియోస్ నిర్మిస్తుండగా, ధిబు నినాన్ థామస్ సంగీతం అందిస్తున్నాడు.
