కూతురు వెంటపడ్డాడని కొట్టి చంపేశాడు

కూతురు వెంటపడ్డాడని కొట్టి చంపేశాడు

కూతురు వెంట పడొద్దని ఎంత చెప్పినా వినకపోయేసరికి ఓ తండ్రికి కోపం కట్టలు తెంచుకుంది. కన్నబిడ్డ వెంటపడి వేధిస్తున్న పోకిరీని కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.

కడెం మండలం కొలాంగూడెంలో ఉండే ఓ అమ్మాయిని.. ఏడాది కాలంగా అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల ఆత్రం లక్ష్మణ్ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని తన తండ్రి లస్ముకు చెప్పింది బాధితురాలు. కూతురు జోలికి రావొద్దంటూ లక్ష్మణ్ ను మందలించాడు లస్ము. పల్లెలో పంచాయతీ పెట్టి కూడా పెద్దలతో చెప్పించాడు. ఐనా… లక్ష్మణ్ పద్ధతి మార్చుకోలేదు. రెండు రోజుల కిందట.. ఓ పెళ్లి వేడుకకు లస్ము కూతురు వెళ్లింది. ఓ విషయం మాట్లాడాలి అంటూ బాధితురాలిని పక్కకు రమ్మని లక్ష్మణ్ పిలిచాడు. రాకపోయేసరికి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. అమ్మాయి కేకలు వేయడంతో.. తండ్రి లస్ము అక్కడికి వచ్చి.. కర్రతో లక్ష్మణ్ పై దాడి చేశాడు. తలపై తీవ్రగాయంతో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు లక్ష్మణ్.

లక్ష్మణ్ కుటుంబసభ్యులు కడెం మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు.