కరోనా తర్వాత క్యాంపెయినింగ్ షురూ చేసిన ట్రంప్

కరోనా తర్వాత క్యాంపెయినింగ్ షురూ చేసిన ట్రంప్

న్యూఢిల్లీ: కరోనా సోకడంతో తొమ్మిది రోజులుగా ఎన్నికల క్యాంపెయినింగ్‌‌కు దూరంగా ఉన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రచారాన్ని షురూ చేశారు. ఇప్పుడు తాను గొప్పగా అనుభూతి చెందుతున్నానని ట్రంప్ అన్నారు. వైట్‌‌హౌజ్ బాల్కనీలోకి వచ్చి మాస్క్ తీసి ప్రజలకు ఆయన అభివాదం చేశారు. తన మద్దతుదారులను ఉద్దేశించి బయటికి వచ్చి ఓట్లు వేయండని, వాళ్లను ప్రేమిస్తున్నానని ట్రంప్ చెప్పారు. క్వారంటైన్ పీరియడ్ ముగియక ముందే బయటికి వచ్చిన ట్రంప్‌‌పై వైట్ హౌజ్ డాక్టర్ స్పందించారు. ట్రంప్‌‌లో వైరస్ చురుకుగా ప్రతిబింబించే ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఆయనలో వైరల్ లోడ్ తగ్గుతోందన్నారు. అయితే ట్రంప్‌‌కు కరోనా పూర్తిగా తగ్గిందా లేదా అనే దానిపై మాత్రం సదరు డాక్టర్ ఏమీ చెప్పలేదు.