
- 50 మంది నిజాం కాలేజ్ స్టూడెంట్లను అడ్డుకున్న సిబ్బంది
బషీర్బాగ్, వెలుగు : సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టలేదని 50 మంది స్టూడెంట్లను హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కాలేజ్ సిబ్బంది పరీక్షకు అనుమతించలేదు. తమకు ఎగ్జామ్ ఫీజు విషయంలో సమాచారం లేదని, వెంటనే డబ్బులు కడ్తామని అధికారులను స్టూడెంట్స్ కోరారు. అయినా, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్కు చెందిన 50 మంది స్టూడెంట్లను పరీక్ష రాసేందుకు వైస్ ప్రిన్సిపల్ అనుమతి ఇవ్వలేదు. దీంతో మిగిలిన స్టూడెంట్లు అందరూ కలిసి ఎగ్జామ్ను బహిష్కరించి కాలేజీలో ఆందోళనకు దిగారు.
గతంలో ఇలాగే జరిగితే.. ఫీజు కట్టించుకుని ఎగ్జామ్కు అనుమతి ఇచ్చారని స్టూడెంట్స్ తెలిపారు. ఫీజు కట్టని 50 మంది స్టూడెంట్స్ను ఎగ్జామ్ రాయడానికి అనుమతిస్తేనే తాము పరీక్ష రాస్తామని చెప్పారు. దీంతో కాలేజీ సిబ్బంది అబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆందోళన విరమించాలని స్టూడెంట్స్ను పోలీసులు కోరారు. తమకు న్యాయం జరిగేదాకా ఆందోళన కొనసాగిస్తామని వారు బైఠాయించారు. మూడు గంటల పాటు స్టూడెంట్స్ ఆందోళన చేపట్టినా.. కాలేజ్ సిబ్బంది మాత్రం ఎగ్జామ్ రాసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఫీజు అంశం తమ పరిధిలో లేదని, ఓయూ రిజిస్టార్తో మాట్లాడి చెప్తామని వైస్ ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్ ఆందోళన విరమించారు.