
హైదరాబాద్, వెలుగు: ప్రీమియం కిటికీలు, తలుపుల బ్రాండ్ ఫెనెస్టా, హైదరాబాద్లో తన ఏడో షోరూమ్ను ప్రారంభించింది. ఇది తెలంగాణలో ఈ సంస్థకు పదో షోరూమ్. ఇందులో యూపీవీసీ, అల్యూమినియం కిటికీలు, తలుపులు, ఫసాడ్లు, సాలిడ్ ప్యానెల్ డోర్స్ లభిస్తాయి.
ఈ సందర్భంగా ఫెనెస్టా బిజినెస్ హెడ్ సాకేత్ జైన్ మాట్లాడుతూ, ఈ కొత్త షోరూమ్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ప్రొడక్టులను, పర్సనలైజ్డ్ సర్వీసులను పొందవచ్చని అన్నారు.
ఇళ్లు కట్టుకునేవారికి, వాస్తుశిల్పులకు, బిల్డర్లకు కావాల్సిన ప్రొడక్టులను, సేవలను అందిస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా తమకు 400 మందికి పైగా డీలర్ల నెట్వర్క్ ఉందని, నేపాల్, భూటాన్, మాల్దీవులలోనూ సేవలను అందిస్తున్నట్లు జైన్ వివరించారు.