అక్టోబర్ 1 నుంచి.. నెల రోజులు పలు రైళ్లు రద్దు

అక్టోబర్ 1 నుంచి.. నెల రోజులు పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు : ట్రాక్  మెయింటెనెన్స్ పనులు కారణంగా అక్టోబర్​1 నుంచి 31 వరకు పలు మార్గాల్లో రెగ్యులర్​గా తిరిగే రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

కాచిగూడ– -నిజామాబాద్– -కాచిగూడ, మేడ్చల్​– -లింగంపల్లి– -మేడ్చల్, మేడ్చల్– -సికింద్రాబాద్– మేడ్చల్ మధ్య నడిచే 12 సర్వీసులను రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.