గోల్కొండ కోటలో పంద్రాగస్టు పరేడ్ రిహార్సల్స్

గోల్కొండ కోటలో  పంద్రాగస్టు పరేడ్ రిహార్సల్స్

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం కోటలో పోలీసులు పరేడ్‌‌ రిహార్సల్ నిర్వహించారు. అడిషనల్ డీజీ స్వాతి లక్రా, ఐపీఎస్ సుదీక్ష రెడ్డి పరేడ్‌‌ను పర్యవేక్షించారు. రిహార్సల్స్​లో భాగంగా  ఆదివారం ఉదయం సీఎం కాన్వాయ్  గోల్కొండ కోటకు చేరుకుంది. మిగతా ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.