విక్రాంత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. మెహ్రీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ‘లైఫ్’ అనే ట్యాగ్లైన్తో రూపొందుతోన్న ఈ చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. ఇప్పటికే నాలుగు పాటలు విడుదల చేయగా, బుధవారం ‘రాధేశా’ అంటూ సాగే ఐదో పాటను రిలీజ్ చేశారు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, శ్వేతా మోహన్ పాడింది. విక్రాంత్, మెహ్రీన్లు ప్రేమలో మునిగి తేలుతున్నట్టుగా చిత్రీకరించిన పాట ఆకట్టుకుంది.