- పార్లమెంట్లో నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కొవిడ్ 19 క్రైసిస్ నుంచి గట్టెక్కడానికి కరెన్సీ ప్రింట్ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు. ఎకానమీని కాపాడేందుకు, ఉపాధి కల్పనకూ సాయపడేలా మరిన్ని కరెన్సీ నోట్లను ప్రింట్ చేయాలని చాలా మంది ఎకానమిస్టులు, ఎక్స్పర్ట్స్ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్తో 2020–21లో జీడీపీ 7.3 శాతం మేర తగ్గిపోయిందని, ఎకానమీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం చాలా చర్యలను తీసుకుందని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. మన ఎకానమీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయని, ఆత్మనిర్భర్ భారత్ మిషన్తో ఎకానమీ గాడిలో పడుతోందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కింద రూ. 29.87 లక్షల కోట్ల ప్యాకేజ్ను తెచ్చామని గుర్తుచేశారు.