న్యూఢిల్లీ: ఏవియేషన్ ఇండస్ట్రీకి దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ సెక్టార్పై ఐఐఎఫ్సీఎల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వివేక్ జోషి పాల్గొన్నారు. ఉడే దేష్కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) స్కీము తేవడంతో దేశంలోని ఏవియేషన్ ఇండస్ట్రీ గత ఏడెనిమిదేళ్లలో పుంజుకుందని పేర్కొన్నారు.
దీంతో 2014 లో 74 గా ఉన్న ఎయిర్పోర్టుల సంఖ్య రెట్టింపై 148 కి చేరిందని వివరించారు. మరో 21 గ్రీన్ఫీల్డ్ఎయిర్పోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందన్నారు. నోయిడా, నవీ ముంబైలలో రానున్న రెండు పెద్ద ఎయిర్పోర్టుల కెపాసిటీని భారీగా పెంచనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఇండస్ట్రీ– ఫ్రెండ్లీ పాలసీల వల్లే ఏవియేషన్ ఇండస్ట్రీ జోరందుకుందని వెల్లడించారు.
మన ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రపంచంలో మూడో పెద్దదని, మరింతగా ఎదగడానికి మనకు అవకాశాలున్నాయని జోషి వివరించారు. గడిచిన పదేళ్లలో మన ఏవియేషన్ ఇండస్ట్రీ ఏటా 10 శాతం చొప్పున గ్రోత్ సాధించిందని, గ్లోబల్ యావరేజ్ కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. ఈ రంగం మరింతగా విస్తరించడానికి ఎయిర్క్రాఫ్ట్, ప్లేన్ ఇంజిన్స్, ఎయిర్ఫ్రేమ్స్, హెలికాప్టర్స్ వంటి వాటి ట్రాన్సాక్షన్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ (ఐబీసీ) కోడ్ నుంచి కిందటి వారమే కార్పొరేట్ అఫెయిర్స్ మినిస్ట్రీ మినహాయించిందని జోషి వివరించారు.