
అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు తోపుడుబండిపై తీసుకెళ్లి.. ఆసుపత్రికి తరలించిన ఘటనపై ఇటీవల స్థానిక జర్నిలిస్టులు ఓ వార్త ఇచ్చారు. అయితే ఆ వార్త ఇచ్చిన ముగ్గురు పాత్రికేయులపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా లహర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... వారు ఇచ్చిన వార్త పూర్తిగా అబద్దం, ఆ వార్త నిజమనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. జర్నలిస్టులు ఇచ్చిన సమాచారం తప్పని భావిస్తూ వారిపై ఐపీసీ సెక్షన్ 420,505(2)తో పాటు సెక్షన్ 66(ఎఫ్) లు నమోదయ్యాయి.
మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ జిల్లా మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ దర్యాప్తుకు ఆదేశించారు. అనంతరం ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఆ కుటుంబం అసలు అంబులెన్సుకు ఎలాంటి ఫోనూ చేయలేదని, ఆ వార్తే నిజం కాదని చెప్పారు. వారికి ప్రభుత్వం తరపునుంచి అన్ని పథకాలూ అందుబాటులో ఉన్నాయన్న ఆయన.. తప్పుడు వార్త ఇచ్చి జర్నలిస్టులు అందర్నీ తప్పుదోవ పట్టించారన్నారు. అందుకే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.
In Madhya Pradesh's Bhind district an #FIR has been registered against #journalists for allegedly showing the below video.
— Vishnukant (@vishnukant_7) August 20, 2022
The state of Failing Healthcare in MP. @vinodkapri @thealokputul @riteshmishraht @ShyamMeeraSingh @zoo_bear @alishan_jafri pic.twitter.com/1K25PUeiTv