ఢిల్లీ సీబీఐ ఆఫీసులో అగ్నిప్రమాదం

ఢిల్లీ సీబీఐ ఆఫీసులో అగ్నిప్రమాదం

ఢిల్లీ  లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​ (CBI)ఆఫీసులో  అగ్నిప్రమాదం  జరిగింది. ఇవాళ( శుక్రవారం) మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. లోధి రోడ్ ప్రాంతంలోని సీజీఐ కాంప్లెక్స్‌లో CBI భవనంలోని బేస్​మెంట్​లో మంటలు అంటుకున్నట్లు  తెలుస్తోంది. మంటలు రావడంతో కార్యాలయంలోని ఉద్యోగులంతా బయటికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది..ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.