
శంషాబాద్, వెలుగు: మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లైవుడ్గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సలీం ప్లైవుడ్గోడౌన్లో ఆదివారం షార్ట్సర్క్యూట్కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు పోలీసులకు, ఫైర్సిబ్బందికి సమాచారం అందించారు.
వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.15 లక్షల విలువైన సామగ్రి కాలిబూడిదైనట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.