రైలులో మంటలు..పరుగులు తీసిన జనం

రైలులో మంటలు..పరుగులు తీసిన జనం

ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కర్నాటక రాజధాని బెంగళూరులోని సంగోల్లి రాయన్న రైల్వే స్టేషన్‌లో  ఉద్యాన ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. రైలు స్టేషన్ కు చేరుకున్న తర్వాత ఏసీ కోచ్ లో మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేషన్ ఆవరణలోని ప్రయాణికులు పరుగులు తీశారు. 

 ముంబై షోలాపూర్ బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆగస్టు 19వ తేదీ శనివారం ఉదయం సంగోల్లి రాయన్న రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే స్టేషన్లో ఆగిన తర్వాత కొద్దిసేపటికే ఏసీ కోచ్ లో మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. అయితే రైలు నుంచి అప్పటికే ప్రయాణికులంతా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.