ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కింగ్ ప్లేస్లో అగ్ని ప్రమాదం

ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కింగ్ ప్లేస్లో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జామియా నగర్ లోని ఓ ఎలక్ట్రిక్ మోటార్ పార్కింగ్ ప్లేస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పార్కింగ్ ప్లేస్ లో నిలిపిన వాహనాల నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వాటిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఒకదాని వెంట మరొక వాహనానికి మంటలు అంటుకోవడంతో భారీ ఆస్తినష్టం జరిగింది. 

అగ్ని ప్రమాదంలో ఒక మోటార్ బైక్, రెండు స్కూటీలతో పాటు 30 ఈ రిక్షాలు, 50 పాత ఈ రిక్షాలు కాలి బూడిదయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది ఏడు ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.