
శంషాబాద్, వెలుగు: రన్నింగ్లో ఉన్న స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మైలార్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు బుధవారం సాయంత్రం స్టూడెంట్స్ను దింపేసి మేలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలోని నాగర్గుల్ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు లేచాయి. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఘటన సమయంలో బస్సులో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.