టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి

టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి

టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 7 మంది  మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 పరగణాల జిల్లాలోని బరాసత్​లోని ఓ టపాసుల ఫ్యాక్టరీలో ఆగస్టు 27  తెల్లవారుజామున పేలుడు జరిగింది. 

ఆ టైంలో అక్కడే ఉన్న 7 మంది ప్రమాదం ధాటికి అక్కడికక్కడే మృతి చెందారు. స్టేట్ యూనివర్శిటీకి 3 కిలోమీటర్ల దూరంలో  పేలుడు జరగ్గా  ఐదుగురు గాయపడ్డారు.  

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పేలుడు ధాటికి చుట్టు పక్కల బిల్డింగ్​లు సైతం బీటలువారాయి. 

మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను బరాసత్​ ఆసుపత్రిలో జాయిన్​ చేశారు. శిథిలాల మధ్య చిక్కుకున్న పలువురిని స్థానికులు కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.