అమెరికాలో భారతీయ విద్యార్థిపై కాల్పులు

అమెరికాలో భారతీయ విద్యార్థిపై కాల్పులు

అమెరికాలో మరోసారి ఓ భారతీయుడిపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి చనిపోయాడు. పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల బల్జీత్‌సింగ్‌ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఖాళీ సమయంలో షికాగోలోని ఒక డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని గదికి బయలుదేరిన బల్జీత్‌ను దుండగులు కొందరు తుపాకులతో అడ్డగించారు. నగదు, సెల్‌ఫోన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర సెల్‌ఫోన్‌ లేదనడంతో దుండగులు అతనిపై కాల్పులు జరిపి అక్కడి నుండి పరారయ్యారు. బాధితుడి సమాచారంతో స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బల్జీత్‌ చనిపోయాడు. బల్జీత్‌ కుటుంబానికి సమాచారం అందించిన షికాగో పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.