- నాగపూర్ నుంచి హైదరాబాద్వస్తున్న 29 మంది క్షేమం
- షార్ట్ సర్య్యూటే కారణం
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద మంళవారం తెల్లవారుజామున పూజా ట్రావెల్స్కు చెందిన ఏసీ బస్సులో షార్ట్సర్క్యూట్తో మంటలు ఎగసిపడ్డాయి. ఈ బస్సు సోమవారం రాత్రి మహారాష్ట్ర లోని నాగ్పూర్ లో బయలుదేరి హైదరాబాద్ వస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 26 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నాడు.
పొగ వాసన రావడంతో గుర్తించిన కొందరు ప్రయాణికులు నిద్రపోతున్నవారందరినీ అలర్ట్చేసి కిందకు దింపారు. అందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అందులోని ప్యాసింజర్ల లగేజీ కూడా పూర్తిగా కాలిపోయింది.