జగిత్యాల జిల్లాలో తొలి కరోనా మ‌ర‌ణం

జగిత్యాల జిల్లాలో తొలి కరోనా మ‌ర‌ణం

జగిత్యాల జిల్లాలో తొలి కరోనా మ‌ర‌ణం న‌మోదైంది. కరోనా బారినపడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న జగిత్యాలలోని కృష్ణానగర్ కు చెందిన వృద్ధుడు (75) శనివారం రాత్రి మృతి చెందాడు. ముంబాయి నుంచి వచ్చిన వలస కూలీ అయిన వృద్ధుడికి ఈ నెల 20 న క‌రోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ శ‌నివారం అక్కడే మరణించాడు. అత‌ని కూతురికి కూడా పాజిటివ్ రాగా శ‌నివారం రాత్రి చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.